May 01, 2024, 07:05 IST/బోధన్
బోధన్
మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థి సూసైడ్
May 01, 2024, 07:05 IST
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మహంతం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రమేష్ కుమారుడు హరి చరణ్ కు పదో తరగతి ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపంతో పొలంలో కలుపు మందు తాగి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.