ఉద్యోగికి తెలియకుండా లోన్ తీసుకుని.. డబ్బులు నొక్కేశారు!

73பார்த்தது
ఉద్యోగికి తెలియకుండా లోన్ తీసుకుని.. డబ్బులు నొక్కేశారు!
సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తెలియకుండా లోన్ తీసుకుని.. డబ్బులు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. విద్యానగర్‌కు చెందిన రూమ్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఈ నెల 5న రూప్ కుమార్‌కు కాల్ వచ్చింది. ముంబైకి చెందిన సైబర్ క్రైమ్ పోలీసులమని బెదిరించి రూప్ కుమార్ వ్యక్తిగత, బ్యాంకు వివరాలను తీసుకున్నారు. ఆ వివరాలతో రూప్ కుమార్‌కు తెలియకుండా రూ.13.8 లక్షల లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్నట్లు బ్యాంక్ నుంచి ఫోన్ రావడంతో అసలు విషయం బయటకొచ్చింది.

தொடர்புடைய செய்தி