ఖాళీ బిందెలతో మహిళల నిరసన

57பார்த்தது
తమ కాలనీలో ఎన్నో ఏళ్లుగా తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, సమస్యను పరిష్కరించాలని కారంపూడిలోని దాచేపల్లి రహదారిలో గల ముదిరాజ్ కాలనీ వాసులు కోరారు. బుధవారం కాలనీలో ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పాలకులు, అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. కాలనీలో కనీస మౌలిక వసతుల సదుపాయం కల్పించ లేదన్నారు. నూతన ప్రభుత్వమైన తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you