గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు నిందితులు అరెస్ట్

63பார்த்தது
నిషేధిత మాదకద్రవ్యమైన గంజాయిని విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు మంగళవారం తెనాలి త్రీ టౌన్ ఎస్సై రమేష్ బాబు ఆధ్వర్యంలో, తెనాలి పట్టణం లోని 30వ వార్డు చెంచుపేట ఉడా పార్కు లోపల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆరుగురు అనుమానితులని అదుపులో తీసుకుని, వారి వద్ద నుంచి 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி