మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ కీలక ప్రకటన

66பார்த்தது
మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ కీలక ప్రకటన
మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి మార్గంలో ఆసుపత్రికి వచ్చే వారికి మినహా ఇతరులకు ప్రవేశం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ మధబానందకర్ బుధవారం తెలిపారు. రెండు వైపులా ఉన్న దారిని ప్రజలు విజయవాడకు వెళ్లే మార్గంగా చేస్తున్నారని, దీనితో భద్రతా సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎయిమ్స్ కి హైవే వైపు ఉన్న మార్గాన్ని సెప్టెంబర్ 14 నుంచి సా. 6 నుంచి ఉ. 7 వరకు, సెలవు దినాల్లో పూర్తిగా మూసివేస్తున్నట్లు తెలిపారు. తూర్పు వైపు రహదారి తెరిచి ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி