చైనాలో ‘యాగీ’ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తుపాన్ అక్కడ బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో గంటకు 234 కి.మీ వేగాన్ని మించి బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో వాహనాలు, ప్రజలు సైతం కొట్టుకుపోతున్నారు. పలుచోట్ల రేకుల షెడ్స్ గాల్లోకి ఎగిరిపోతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ తుఫానుపై చైనా జాతీయ వాతావరణ కేంద్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది.