VIDEO: స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టిన యువకుడు

60பார்த்தது
కర్ణాటకలోని కలబురగిలో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. నదీమ్(26) అనే యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటనలో దాదాపు 6 స్కూటర్లు దహనమయ్యాయి. 20 రోజుల క్రితం కొన్న స్కూటర్ లో సమస్యలు రావడంతో నదీమ్ రిపేర్ కోసం షోరూం స్టాఫ్‌ను సంప్రదించాడు. ఎన్ని సార్లు వెళ్లినా అక్కడి స్టాఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగ్రహానికి గురై, షోరూంకు నిప్పంటించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

தொடர்புடைய செய்தி