ఈనెల 1న గచ్చిబౌలి హాస్టల్లో యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు నమోదైంది. గచ్చిబౌలిలోని బాలాజీ పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నాడు యశ్వంత్(25) బావ శ్రీకాంత్. అదే హాస్టల్లో ఉంటూ ఉద్యోగం కోసం యశ్వంత్ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అప్పులపాలైన శ్రీకాంత్ బామ్మర్దిని డబ్బు ఇచ్చి మరీ హత్య చేయించాడు. ఆపై ఉరి వేసుకున్నాడని నమ్మించారు. అయితే ఖననం అనంతరం అనుమానం వచ్చిన యశ్వంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్య చేసినట్లు శ్రీకాంత్ ఒప్పుకున్నాడు.