వర్గల్ మండలం నాచారం లక్ష్మీనరసింహస్వామి ఆలయం వెనకగల చెరువులో సోమావారం మృతదేహం లభించినట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. వెల్దుర్తి మండలం కుకునూరికి చెందిన చెవుల పోశయ్య (60)గా గుర్తించారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మూడు నెలల క్రితం పోచయ్య ఇంట్లోంచి వెళ్ళాడు. పలు ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.