సీఎం రేవంత్ ను కలిసిన హెచ్పిఎల్ టెక్నాలజీ సంస్థ చైర్‌పర్సన్

63பார்த்தது
సీఎం రేవంత్ ను కలిసిన హెచ్పిఎల్ టెక్నాలజీ సంస్థ చైర్‌పర్సన్
సీఎం రేవంత్ రెడ్డిని ప్రఖ్యాత హెచ్సీఎల్ టెక్నాలజీస్ సంస్థ చైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ భేటీలో టెక్నాలజీ రంగం అభివృద్ది, తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రపంచ అవసరాలను తీర్చగలిగే స్థాయిలో ప్యూచర్ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలు, పెట్టుబడుల విస్తరణ పట్ల రోష్ని నాడార్ ఆసక్తి కనబరిచారు.

தொடர்புடைய செய்தி