సోన్ మండల కేంద్రంలోని శ్రీ గొడిసెర్యాల శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో సోమవారం విశేష పూజలు జరిపారు. ఆలయ వ్యవస్థాపకులు సదానంద్ స్వామి ఆధ్వర్యంలో శివయ్యకు అభిషేకాలు అర్చనలు జరిపారు. శివ భక్తులు మాలదరణ విరమించారు. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపారు. భక్తులకు అన్నదానం చేపట్టారు.