బాసర ఆర్జియూకేటీని ప్రక్షాళన చేసి
అవినీతిపై విచారణ చేయాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. గురువారం నిర్వహించిన శాసనసభలో మాట్లాడారు. నెలకొన్న సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. శాశ్వత ఉపకులపతిని నియమించాలని, విశ్వవిద్యాలయంలో గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు పెరిగాయని వివరించారు. బాలికలు ఒక్కో గదిలో ముగ్గురు ఉంటున్నారని ఈ విధంగా ఉండటంతో ఇబ్బందులు ఎదురుకుంటున్నారని అన్నారు.