కుక్కకాటుతో బాలుడు మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జామ్గాం గ్రామానికి చెందిన ఈశ్వర్ (14) కు 15 రోజుల క్రితం కుక్కకాటు వేయగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.