బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు జి. రాంసింగ్, కాడపాక మహేందర్, మనోహర్ చౌదరి, ట్రస్ట్ వ్యవస్థాపకుల సహకారంతో గర్భిణులకు బాలింతలకు, రోగులకు భోజనం అందించారు.