మహారాష్ట్ర సచివాలయం పైనుంచి అధికార కూటమి ఎమ్మెల్యే దూకడం కలకలం రేపింది. అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే నరహరి ఝిర్వాల్ సచివాలయం మూడో అంతస్తు నుంచి దూకేశారు. అయితే, అప్పటికే భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన వలలో పడడంతో.. ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ధనగర్ కమ్యూనిటీ డిమాండ్ చేస్తున్న ఎస్టీ (షెడ్యూల్డ్ ట్రైబ్) రిజర్వేషన్కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.