నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం

51பார்த்தது
నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం
కోస్గి మండలం బలభద్రాయపల్లిలో నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన నరసింహ, కవిత దంపతులకు ఇద్దరు కుమారులు నిహన్స్ (3), భానుమూర్తి (2)లు బుధవారం ఇంటి పక్కన ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో వారు ఊరంతా గాలించారు. చివరకు నీటి గుంతలో వెతకడంతో మృతదేహాలు దొరికాయి. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

தொடர்புடைய செய்தி