ప్రాణం తీసిన క్షణికావేశం

60பார்த்தது
ప్రాణం తీసిన క్షణికావేశం
క్షణికావేశంలో ఎలుకల మందు తాగి బాలిక మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్ఐ వివరాల ప్రకారం.. మహమ్మదాబాద్ మండల దేశాయిపల్లికి చెందిన దొంగల చంద్రకళ, కృష్ణయ్యల కూతురు శ్రీలత (14) నంచర్లలో పది చదువుతుంది. తన పుట్టినరోజు సోమవారం తల్లి ఇచ్చిన రూ.200లతో తోటి విద్యార్థులకు చాక్లెట్లు పంచింది. తండ్రి కృష్ణయ్య చాక్లెట్లకు డబ్బులు ఎక్కడివని మందలించగా శ్రీలత క్షణికావేశంలో ఇంట్లోని ఎలుకల మందు తాగింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

தொடர்புடைய செய்தி