కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం భట్పల్లి గ్రామ పంచాయతీలో నిర్వహణ లోపంతో వీధి దీపాలు వెలగక లక్ష్మినగర్ కాలనీలో అంధకారం నెలకొంటోంది. గత 2, 3 నెలలుగా దాదాపు ఇదే పరిస్థితి అని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా, గ్రామపంచాయతీ కార్యదర్శి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన కూడా పట్టించుకోవడం లేదని లక్ష్మీనగర్ వాసులు వాపోతున్నారు.