కరెంట్ షాక్ తో రైతు మృతి

83பார்த்தது
కరెంట్ షాక్ తో రైతు మృతి
రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం కొత్తూరుతండాలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. కొత్తూరుతండా గ్రామానికి చెందిన ధరావత్ హతీరాం (42) సాగు చేస్తున్న పత్తి పంటలో కోతులు పడి పత్తికాయలు తింటుండడంతో వాటిని తరిమేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పక్క చేను రైతు అమర్చిన విద్యుత్ తీగలను గమనించని హతీరాం వాటికి తగిలి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி