ఉరేసుకొని తాపీమేస్త్రీ బలవన్మరణం

73பார்த்தது
ఉరేసుకొని తాపీమేస్త్రీ బలవన్మరణం
పాల్వంచ కరకవాగుకు చెందిన పి. గోపి(45) తాపీమేస్త్రీ. రెండు నెలల క్రితం కరీంనగర్లో పనిచేస్తున్న సమయంలో కింద పడటంతో నడుము, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఇంటికే పరిమితం కావడం, అప్పులు పెరగడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై కుటుంబ గొడవలు జరుగుతుండటంతో మనస్తాపం చెందిన గోపి ఇంట్లో ఉరేసుకొని గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య యశోద ఫిర్యాదుతో ఎస్సై సుమన్ కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி