పాల్వంచ కరకవాగుకు చెందిన పి. గోపి(45) తాపీమేస్త్రీ. రెండు నెలల క్రితం కరీంనగర్లో పనిచేస్తున్న సమయంలో కింద పడటంతో నడుము, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఇంటికే పరిమితం కావడం, అప్పులు పెరగడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై కుటుంబ గొడవలు జరుగుతుండటంతో మనస్తాపం చెందిన గోపి ఇంట్లో ఉరేసుకొని గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య యశోద ఫిర్యాదుతో ఎస్సై సుమన్ కేసు నమోదు చేశారు.