ఆర్టీసీ బస్సులో గంజాయి పట్టివేత

83பார்த்தது
ఆర్టీసీ బస్సులో గంజాయి పట్టివేత
ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న నలుగురిని చంద్రుగొండలో పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం నుంచి గుంటూరు వెళ్తున్న బస్సులోకి సారపాక వద్ద నలుగురు ప్రయాణికులు విజయవాడ వెళ్లేందుకు ఎక్కారు. వారివద్ద నాలుగు బ్యాగులు ఉన్నాయి. చంద్రుగొండలో బస్సు ఆపి తనిఖీ చేయగా వారి బ్యాగుల్లో సుమారు పది కిలోల గంజాయి లభ్యమైనట్టు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி