భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

60பார்த்தது
భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్
సింగరేణి క్రింద చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత కలెక్టరేట్ లో సింగరేణి పరిధిలో పెండింగ్ భూ సేకరణపై అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో మంథని ఆర్డీఓ హనుమా నాయక్, సింగరేణి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி