ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ పర్సు మాయం

81பார்த்தது
జగిత్యాల ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చిన మహిళ నగదు, మొబైల్ కొట్టేశారు గుర్తు తెలియని వ్యక్తులు. జగిత్యాల పట్టణానికి చెందిన జలజ అనే మహిళ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం దరఖాస్తు ఇవ్వడానికి జగిత్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చింది. ప్రజావాణి దరఖాస్తు ఇచ్చి తిరిగి వచ్చి చూసేసరికి నగదు మొబైల్ ఫోను ఉన్న కవర్ కనిపించకపోవడంతో అక్కడ ఉన్న అధికారులకు ఫిర్యాదు చేసింది.

தொடர்புடைய செய்தி