బావిలో దూకిన మహిళను ఫైర్ సిబ్బంది కాపాడారు. గురువారం హుజూరాబాద్ మండలం సిర్సపల్లికి చెందిన మన్యాల శారద (45) మతిస్తిమితం లేక గ్రామంలోని బావిలో దూకింది. స్థానిక ప్రజలు వెంటనే హుజూరాబాద్ ఫైర్ స్టేషన్కి కాల్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది గ్రామానికి చేరుకొని బావిలో దిగి శారదను సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా స్థానికులు ఫైర్ సిబ్బందిని అభినందించారు.