భిక్కనూరు మండలంలోని మల్లుపల్లి గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందారు. మల్లుపల్లి తండాకు చెందిన మాలవత్ శ్రీకాంత్ తన చెల్లెను రామాయంపేట నుండి ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని గ్రామానికి వస్తుండగా ఎదురుగా వస్తున్న జేసీబీ వాహనం ఢీకొట్టింది. దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా ఆయన చెల్లే మౌనికకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి.