భూ తగాదాల్లో మామిడి తోట ధ్వంసం.!

57பார்த்தது
భూ తగాదాల్లో మామిడి తోట ధ్వంసం.!
బొంరాస్ పేట మండలం ఏర్పుమల్ల పంచాయతీ పరిధిలోని కాకర్ల గండి తాండాలో మామిడి తోటను ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. తాండకు చెందిన మాణిక్యం నాయక్, అదే తాండకు చెందిన బాల్య నాయక్ మధ్య భూ తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో బాల్యా నాయక్ జెసిబి సాయంతో మామిడి తోటలోని చెట్లను ధ్వంసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి ఆ భూమి ఎవరిదో తేల్చేందుకు ప్రయత్నిస్తామని ఎస్ఐ రవూఫ్ తెలిపారు.

தொடர்புடைய செய்தி