వికారాబాద్ పట్టణ సమీపంలో అనంతగిరి కొండల్లో ఉన్న 213 ఎకరాలను రూ. 98 కోట్ల నిధులతో ఎకో టూరిజం జోన్గా తీర్చిదిద్దనున్నారు. కాటేజీలు, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్, రోడ్లు, పార్కింగ్, ట్రాకింగ్ పాయింట్, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు కల్పించనున్నారు. వీటితో పాటు సమీపంలోని కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టులను పర్యావరణ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు.