చాక్లెట్ తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం

60பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ భాగ్యలక్ష్మి కాలనిలో చాక్లెట్ తయారీ కంపెనీలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. చాక్లెట్ పౌడర్ ను వేడి చేసే క్రమంలో గ్యాస్ లీకేజి కావడంతో దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. ఇళ్ళ మధ్యలో ఉన్న చాక్లెట్ కంపెనీలో మంటలు రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

தொடர்புடைய செய்தி