ఢిల్లీలోని రంగపురి ప్రాంతంలో హీరాలాల్ (50) తన కుటుంబంతో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతని నలుగురు కుమార్తెలు దివ్యాంగులే. కొన్నేళ్ల క్రితం హీరాలాల్ భార్య క్యాన్సర్తో మృతి చెందింది. దాంతో కూతుళ్లు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. అయితే హీరాలాల్ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. తన నలుగురు కూతుళ్లకు విషం ఇచ్చి.. తానూ తాగి హీరాలాల్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. దర్యాప్తు జరుగుతోంది.