శ్రీ సత్యసాయి జిల్లా కొత్తమిట్టలో వినాయక చవితి రోజు రాత్రి మండపం వద్ద ఒంటరిగా ఉన్న చెవిటి, మూగ అయిన బాలికను పొదల్లోకి లాక్కెళ్లి జనార్ధన్ అనే మాజీ వాలంటీర్ మద్యం మత్తులో అత్యాచారం చేశాడు. కాసేపటికి పిల్లలు గమనించి కేకలు వేయడంతో బాధితురాలిని వదిలేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో సదరు వ్యక్తి 'నా చావుకు ఎవరూ కారణం కాదు' అని లేఖ రాసి ఉరేసుకుని చనిపోయాడని చెప్పారు.