కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టినా దక్కని ప్రాణం (వీడియో)

1011பார்த்தது
హైదరాబాద్ బంజారాహిల్స్ రెయిన్ బో హాస్పిటల్లో విషాద ఘటన జరిగింది. రూ.కోటిన్నర ఖర్చుపెట్టినా తమ కుమారుడిని తల్లిదండ్రులు కాపాడుకోలేకపోయారు. శ్రీకాంత్ అనే బాలుడు కాలేయ సమస్యలతో చికిత్స పొందుతున్నాడు. వైద్యం నిమిత్తం తల్లిదండ్రులు ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టారు. అయినప్పటికీ నిన్న రాత్రి శ్రీకాంత్ మృతి చెందాడు. దీంతో కోటిన్నర ఖర్చు పెడితే మృతదేహాన్ని అప్పగిస్తారా అంటూ హాస్పిటల్ ముందు బంధువులు ధర్నా చేపట్టారు.

தொடர்புடைய செய்தி