జహీరాబాద్ సభలో ఇవాళ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై BRS చీఫ్ కేసీఆర్ స్పందించారు. కొత్తగూడెం రోడ్షోలో మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోదీ అన్నారు. వారిద్దరూ ఒకటి కాకపోతే వెంటనే సీఎంపై వెంటనే విచారణకు ఈడీ, ఐటీని దించాలి. గోదావరి నీళ్లు లేకుండా చేస్తామని మోదీ అన్నారు. ఆయన వ్యాఖ్యలను రేవంత్ ఎందుకు ఖండించడం లేదు?’ అని ప్రశ్నించారు.