కల్సా ఎడ్యుకేషన్ సొసైటి ఆధ్వర్యంలో ప్రముఖ గణిత విద్యావేత్త సర్ధార్ ధర్మేందర్ సింగ్ జ్ఞాపకార్థం ఆదిలాబాద్ పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లను ఆదివారం పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు సొసైటీ తరఫున అండగా ఉంటామని, సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపల్ నరసింహరావ్, సొసైటి సభ్యులు మధు, మోగేష్, దీక్షిత్, తదితరులు ఉన్నారు