ఆదిలాబాద్ జిల్లా మాజీ మంత్రి, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గోడం నగేష్ కారు దిగి, కమలన్ని అందుకున్నారు. గత కొంతకాలంగా అనుకున్నట్లుగానే బిఆర్ఎస్ పార్టీ కి చెందిన నగేష్ ఆదివారం బీజేపీ పార్టీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ నేతృత్వంలో బీజేపీ కండువాను కప్పుకున్నారు.