మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫణికుమార్ (40) బుడమేరు వరదలో చిక్కుకుని గల్లంతయ్యాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఫణికుమార్ వినాయక చవితి సందర్భంగా సొంతూరుకు వచ్చారు. నిన్న గన్నవరంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి మచిలీపట్నం బయలుదేరాడు. బుడమేరు ఉధృతి గురించి స్థానికులు హెచ్చరించినా పట్టించుకోకుండా వెళ్లి వరదలో చిక్కుకున్నాడు. ఓ చోట నీట మునిగిన అతని కారును పోలీసులు గుర్తించారు. అతని కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.