టంగుటూరు: వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు అపహరణ

85பார்த்தது
టంగుటూరు: వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు అపహరణ
ప్రకాశం జిల్లా టంగుటూరులో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. శుక్రవారం స్థానిక పోలేరమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న రంగమ్మ అనే వృద్ధురాలి మెడలో ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు బంగారు గొలుసును అపహరించుకొని పరారయ్యారు. భయాందోళనకు గురైన వృద్ధురాలు బోరున విలపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.

தொடர்புடைய செய்தி