ఏపీలో తీవ్ర విషాదం

70பார்த்தது
ఏపీలో తీవ్ర విషాదం
ఏపీలోని ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవగుంటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భర్త, ఇద్దరు పిల్లలు ఒకేసారి మృతి చెందడంతో.. రెండు రోజులుగా తీవ్ర మనస్థాపంతో ఉన్న భార్య దేవి చివరకు ప్రాణాలు విడిచింది. రెండు రోజుల క్రితం పోలవరం కుడి కాలువలో పడి భర్త శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, ఇద్దరు పిల్లలు మణికంఠ, సాయికుమార్ మృతి చెందారు. తీవ్ర మనస్థాపానికి గురైన భార్య దేవి కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

தொடர்புடைய செய்தி